సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీద మంత్రి కందుల దుర్గేష్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాష్ రాజ్కు, ప్రశ్న రావణ్కు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇద్దరినీ సంఘ విద్రోహ శక్తులంటూ సంచలన ఆరోపణలు చేసిన కందుల దుర్గేష్.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రకాష్ రాజ్కు ప్రతి నెలా డబ్బులు అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కందుల దుర్గేష్ మండిపడ్డారు.