ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చే వలస కార్మికుల పిల్లలు చదువుకు దూరం కాకుండా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నార్సింగిలో దేశంలోనే తొలి వర్క్ సైట్ స్కూల్ను ఏర్పాటు చేసి 37 మంది చిన్నారులకు విద్య అందిస్తోంది. త్వరలో మరో 2 పాఠశాలలు ప్రారంభించనుండగా.. భవిష్యత్తులో సైబరాబాద్ పరిధిలోని 100 లేబర్ క్యాంపులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పిల్లలకు విద్యతో పాటు భద్రత కూడా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.