మెట్రో రైలులో 'మగాళ్లను చంపడం ఎలా' అనే బుక్ చదువుతూ ఓ యువతి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ యువతికి కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పుడు ఇంకో యువకుడు.. భార్యను బొందపెట్టడం ఎలా అంటూ ఓ ఫేక్ బుక్ను పట్టుకుని మెట్రో రైలులో కనిపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల సంబంధాలు పూర్తిగా క్షీణించి.. ఒకరిని మరొకరు చంపుకునే స్థాయికి వెళ్లగా.. ఇటీవలి కాలంలో వార్తల్లో చాలా వరకు ఇలాంటి వార్తలే ఉండగా.. ఈ మెట్రో బుక్ వార్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.