హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్లో నగరంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.459 కోట్లతో మూడు పైవంతెనలు, ఒక అండర్ పాస్ నిర్మిస్తుండగా.. ఖాజాగూడ జంక్షన్ పనుల కోసం రూ.220 కోట్లు కేటాయించారు. ఈ సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టులను 2027 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్లైఓవర్ వల్ల గచ్చిబౌలి, విప్రో సర్కిల్, కొండాపూర్ మార్గాల్లో ప్రయాణ సమయం 15 నిమిషాల వరకు కలిసిరానుంది.