మిడ్జిల్ కృతజ్ఞత సభలో మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో కేసీఆర్ను పోలుస్తూ.. తెలంగాణ ప్రజలు ఆయనను ఫామ్హౌస్కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం అనేది కల మాత్రమేనని.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు.