రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని బహదూర్గూడ శనివారం రణరంగంగా మారింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తలపెట్టిన భూసేకరణ ప్రక్రియ రైతులు వర్సెస్ పోలీసులుగా మారింది. 650 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు రెవెన్యూ సిబ్బంది, హైడ్రా అధికారులు రంగంలోకి దిగడంతో స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులలో కొంతమంది పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరివేయటం ఉద్రిక్తతలకు దారి తీసింది.