ఏపీ రైతులకు అమరావతి వాతావరణ కేంద్రం ఊరట కలిగించే వార్త వినిపించింది. ఉపరితల ఆవర్తనం, దాని అనుబంధ ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మార్కాపురం, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.