పలాసలో వింత దొంగలు.. ప్రభుత్వ ఆఫీస్‌లో ఇదేం పని, ఏం చేశారో తెలిస్తే!

1 year ago 42
Palasa Govt Office Files Robbery: పలాస మండలం కాశీబుగ్గ గ్రామీణ నీటిసరఫరా పాత కార్యాలయంలో ఫైళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. పలాస మండల పరిషత్‌ కార్యాలయం పక్కనే.. ఉన్న ఈ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రధాన గ్రామీణ నీటి సరఫరా కార్యాలయంలోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాత కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, ఇంజనీరింగ్‌ పనులకు సంబంధించి పాత ఫైళ్లను ఉంచి.. మిగతావి ప్రధాన గ్రామీణ నీటి సరఫరా కార్యాలయానికి తరలించారు. కొందరు దొంగలు కార్యాలయం వెనక వైపున ఉన్న కిటికీని ఊడగొట్టి పాత ఫైళ్లను మూటలు కట్టి.. చెత్త దుకాణంలో విక్రయించారు.
Read Entire Article