తెలంగాణలో రూ.13 వేల కోట్లతో 6,092 కి.మీ. మేర డబుల్ లేన్ రహదారులను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఈ నెల 28న సీఎం చేతుల మీదుగా నల్గొండలో హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ, 6న కరీంనగర్లో శంకుస్థాపనలు జరగనున్నాయని చెప్పారు. హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని, నిమ్స్, టిమ్స్, వరంగల్ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తూ మంత్రి ఆకస్మిక తనిఖీలకు సిద్ధమయ్యారు.