తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన బి.టెక్ గ్రాడ్యుయేట్ సంజనా రెడ్డి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఐటీ ఉద్యోగం వచ్చినా వదిలేసి.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో సీటు వచ్చినా వెళ్లకుండా సొంత ఊరిలోనే ఉండి వ్యవసాయ రంగాన్ని మార్చాలని నిర్ణయించుకుంది. దళారీల చేతిలో మోసపోతున్న రైతులకు అండగా నిలవడానికి ఇందూరు ఫార్మ్స్అనే స్టార్టప్ను ప్రారంభించి నేడు పలు రాష్ట్రాల్లో విజయవంతంగా డిజిటల్ బిజినెస్ నిర్వహిస్తోంది.