తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. TGFADCAపై జరిగిన సమీక్షలో రసాయనాల విచ్చలవిడి వాడకం, నకిలీ సేంద్రియ ఉత్పత్తులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విధానాల అధ్యయనం అనంతరం అసెంబ్లీలో సమగ్ర బిల్లు ప్రవేశపెడతామన్నారు. కల్తీల గుర్తింపునకు విజిల్ బ్లోయర్ వ్యవస్థ, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, తొలుత క్యూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు.