సత్రవాడలోని టీటీడీ ఆలయంలో టీటీడీ హరికథా కార్యక్రమంలో విధులు నిర్వహించేందుకు వెళ్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్కు చెందిన ఇద్దరు ప్రైవేట్ కళాకారులు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం వడమాలపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కళాకారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కళాకారుల కుటుంబాలకు టీటీడీ అండగా నిలిచింది. అంత్యక్రియల కోసం రూ.25 వేలు, ఎక్స్ గ్రేషియా కింద రూ.5 లక్షలు, వారి పిల్లలకు టీటీడీ విద్యాసంస్థలలో ఉచిత విద్య కల్పిస్తున్నారు.