తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పొలిటికల్ రచ్చకు తాడిపత్రి మరోసారి వేదికైంది. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి కావటంతో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. అనంతపురానికి తరలించారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పెద్దారెడ్డి ఇంటివైపు వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.