ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరికొన్ని గంటలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.