పులివెందుల పేరెత్తగానే వైఎస్ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. రాజశేఖర రెడ్డి డబుల్ హ్యాట్రిక్, జగన్ మోహన్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సాధించిన అసెంబ్లీ స్థానం ఇది. ఇక్కడ 1978 నుంచి వైఎస్ ఫ్యామిలీదే హవా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఒక్కసారి కూడా పసుపు జెండాను ఎగరేయలేకపోయింది. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ చేయలేని పరిస్థితులు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.