హైదరాబాద్లో సరకు రవాణాను సులభతరం చేసేందుకు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య కొత్త లాజిస్టిక్ హబ్ల ఏర్పాటుకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పీపీపీ పద్ధతిలో ఒక్కోటి 100 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని డబీర్పూర్, కొండకల్, దండుమైలారంతో సహా 11 ప్రాంతాలను ఇందుకోసం గుర్తించారు. వీటి ద్వారా నగరంలో భారీ వాహనాల ఒత్తిడి తగ్గడమే కాకుండా.. శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, ఉపాధి అవకాశాలు భారీగా పుంజుకోనున్నాయి.