రంగారెడ్డి జిల్లా అజీజ్నగర్లో 42 ఎకరాల్లో అత్యాధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ భూమిని కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవటంతో పాటు రాష్ట్రంలో భూముల విలువలను శాస్త్రీయంగా సవరించాలని, భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల కోసం ఓటీఎస్ పథకానికి ఆమోదం తెలిపింది.