ఆర్టీసీ కార్మికుల సమస్యలను 100 శాతం పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వేతన సవరణ, సమ్మె కాలపు జీతాల చెల్లింపు, కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థ బలోపేతం కోసం హైదరాబాద్ శివారులో 2 భారీ బస్ టెర్మినళ్లు నిర్మిస్తున్నామన్నారు. అందుకు 250 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించామని.. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఖర్చులు తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్మికులు సంస్థ అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు.