బక్రీద్ ప్రార్థనల సందర్భంగా నేడు ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు హైదరాబాద్ మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. బహదూర్పురా, కిషన్బాగ్ మీదుగా వచ్చే సాధారణ వాహనాలను ఫ్లైఓవర్ల మీదుగా మళ్లిస్తారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ టోలిచౌకి, మెహిదీపట్నం మార్గాల్లో రద్దీని నివారించడానికి సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.