హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే సేవలు, ఒక్క క్లిక్‌తోనే..!

10 months ago 14
హైదరాబాద్‌ నగర పౌరులకు శుభవార్త. జీహెచ్‌ఎంసీ త్వరలో 'ఒక నగరం.. ఒక వెబ్‌సైట్.. ఒక మొబైల్ యాప్' నినాదంతో కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించనుంది. దీని ద్వారా ఇంట్లో నుంచే మొబైల్ ఫోన్ ద్వారా అన్ని పౌర సేవలు పొందవచ్చు, ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్ నంబర్‌తో లాగిన్ అయి ఆస్తిపన్ను, జనన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు వంటి వివరాలను చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సేవల్లోని లోపాలను సరిచేస్తూ, మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే ఈ కొత్త వేదిక లక్ష్యమని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
Read Entire Article