హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో రెండు గంటల్లో.., హెచ్చరికలు జారీ

10 months ago 23
గత రెండ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తాజాగా వాతావరణ శాఖ రానున్న రెండు గంటల్లో మియాపూర్, శంషాబాద్, హయత్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరించింది.
Read Entire Article