హైదరాబాద్లో స్థలాల కొరతను అధిగమించడానికి ఫ్లైఓవర్ల కింద పది 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించాలని టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఆమోదంతో ఐటీ కారిడార్లోని కొండాపూర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ల కింద తొలి విడతగా మూడు కేంద్రాలను నిర్మించనున్నారు. ఇండోర్ తరహాలో నిర్మించే ఒక్కో సబ్స్టేషన్కు రూ.7-8 కోట్ల వ్యయం కానుంది. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డ్రై లేదా వెట్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.