హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం.. ఈసారి టార్గెట్ రూ.5 వేల కోట్లు.. కోకాపేట్‌ ఉందా?

11 months ago 25
HMDA Plots Auction: హైదరాబాద్‌లో భూముల వేలం మళ్లీ మొదలు కానుంది! హెచ్‌ఎండీఏ ఈసారి రూ.5 వేల కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. నగరంలో అభివృద్ధి పనులు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించనున్నారు. కోకాపేట్, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలో మంచి స్పందన రావడంతో ఇక్కడ మళ్లీ వేలం వేస్తున్నారు. రెండు, మూడు దశల్లో మరో పది ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లను వేలం వేస్తారు. వీటి ధర కాస్త తక్కువగానే ఉంటుంది. మరి ఈ సారి ఎవరు ఎంత ధర చెల్లిస్తారో చూడాలి.
Read Entire Article