హైదరాబాద్‌లో మరో మెడికల్ కాలేజీ.. ఆ ప్రాంత ప్రజలకు నిజంగా వరం, వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు

3 months ago 17
హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య కళాశాలను కేటాయించింది. ప్రస్తుతం వనస్థలిపురంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కాలేజీని ఇకపై ఎల్‌బీనగర్ మెడికల్ కాలేజీగా మారుస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది నుంచి టిమ్స్ ప్రాంగణంలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ స్థాయికి చేరనుంది. కాలేజీ తాత్కాలిక నిర్వహణకు భవనాల వేట కొనసాగుతుండగా.. శాశ్వత భవనం నిర్మించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు.
Read Entire Article