హైదరాబాద్లో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో.. ఇప్పటికే చాలా ఫ్లైఓవర్లు నిర్మించగా.. తాజాగా మరొకటి నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఈ 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.416 కోట్లను కూడా కేటాయించింది. త్వరలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు చేపట్టేందుకు అధికారులు రెడీ అయ్యారు.