హైదరాబాద్ శివార్లలో మరో భారీ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఏకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి.. డ్రగ్స్ను తయారు చేసి.. నగరంలో విక్రయిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ క్రమంలోనే ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసి.. రూ.50 లక్షల మెఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ముఠా.. ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.