హైదరాబాద్‌లో దారుణం.. మరదలిని కత్తితో పొడిచి చంపేసిన మేనబావ..

7 months ago 20
హైదరాబాద్‌లోని ముషీరాబాద్, బాపూజీ నగర్‌లో దారుణం జరిగింది. పవిత్ర (17) అనే ఇంటర్ విద్యార్థినిని ఆమె మేనబావ ఉమా శంకర్ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తాగుబోతు అయిన ఉమా శంకర్‌కు పవిత్రను ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో.. కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి తల్లి కళ్లెదుటే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి మనస్పర్థలకు ఇలాంటి దారుణాలకు పాల్పడటం మానవత్వం లేని చర్యగా స్థానికులు విలపిస్తున్నారు.
Read Entire Article