హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా పనిచేసే కృత్రిమ మేధ ఆధారిత సమగ్ర సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం అనలాగ్, మేఘా ఇంజినీరింగ్ సంయుక్త భాగస్వామ్యంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు అత్యవసర వాహనాలకు మార్గం సుగమం చేయడం, నీటి లీకేజీల గుర్తింపు, సమర్థవంతమైన విద్యుత్ నిర్వహణ సాధ్యం కానుంది.