Five Ac Rest Centers For Gig Workers In Hyderabad: హైదరాబాద్లో గిగ్ వర్కర్ల కోసం ఐదు ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, అమెజాన్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది. పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో అమెజాన్తో ఎంవోయూ చేసుకున్నారు. అమెజాన్ సంస్థ సీఎస్ఆర్ కింద ప్రాజెక్ట్ ఆశ్రయ్లో భాగంగా నగరంలో ఐదుచోట్ల ఏసీ విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.