హైదరాబాద్‌లో కొత్త రోడ్లు.. ఈ ప్రాంతాల్లో ఇక నో ట్రాఫిక్, దూసుకెళ్లిపోవచ్చు

11 months ago 24
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌కు ప్రత్యామ్నాయంగా రూ. 307.74 కోట్ల వ్యయంతో కొత్త రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 22 వరకు టెండర్ల గడువు ఉంది. ఈ ప్రాజెక్టులో 6 కిలోమీటర్ల పొడవైన రోడ్డుతో పాటు, ఆర్కేపురం వద్ద ఆర్ఓబీ, ఆర్ యూబీలను నిర్మిస్తారు. దీనికోసం మిలటరీ నుంచి 42.20 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీ తీసుకుంటోంది. ఈ రోడ్లు పూర్తయితే మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది.
Read Entire Article