హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నగరంలోని ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హజ్ యాత్రికులపై పడిన రూ. 10 వేల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యువత స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి సారించి అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలని సూచించారు.