హైదరాబాద్ అత్తాపూర్ దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.700 వివాదంతో మహ్మద్ హుస్సేన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గంజాయి కోసం అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదనే కక్షతో ప్రశాంత్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి హుస్సేన్పై కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హుస్సేన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.