హైదరాబాద్‌లో అడుగంటిన భూగర్భ జలాలు.. రాజస్థాన్ ఎడారి జిల్లాల కంటే దారుణం, ఇలా అయితే కష్టమే..!

2 days ago 3
హైదరాబాద్ మహా నగరం తీవ్ర భూగర్భ జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్‌వాటర్ రీసోర్స్ అసెస్‌మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం నగరంలోని మొత్తం 16 మండలాల్లో 15 మండలాలు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జైసల్మేర్, పంజాబ్‌లోని డార్క్ జోన్ జిల్లాలను తలపించేలా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తక్షణమే వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article