హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన హెచ్-సిటీ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. రూ. 2,500 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న పైవంతెనలు, రోడ్ల విస్తరణ పనులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని సీఎంసీ కమిషనర్ జి.సృజన వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ కూడళ్లలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లతో పాటు అమీన్పూర్ రోడ్డు విస్తరణకు గడువును ఖరారు చేశారు. ఇదే సమయంలో పారిశుధ్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.