తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ను రూ. 5 వేల కోట్లకు పెంచిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ సదస్సులో పాల్గొన్న ఆయన.. భవిష్యత్తులో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ బుల్లెట్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1300 స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టగా.. ఇప్పటికే 260 పూర్తి కావచ్చాయని.. ఇందులో భాగంగా తెలంగాణలోని 40 స్టేషన్లను ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.