భారతీయ రైల్వే ఔషధ రవాణా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక ఫార్మసీ రైలును హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వరకు మే 2న ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా ప్రారంభమైన ఈ కోల్డ్ స్టోరేజీ రైలు ద్వారా హైదరాబాద్లోని ఫార్మా కంపెనీల ఉత్పత్తులు సురక్షితంగా.. వేగంగా ప్రపంచ దేశాలకు చేరుకోవడానికి మార్గం సుగమం అయిందని ఆయన వెల్లడించారు.