సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులకు తీపి కబురు. భక్తుల కోసం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక కాళేశ్వరం ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బయలుదేరే ఈ ఏసీ బస్సు యాత్రలో పుష్కర స్నానం, కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనంతో పాటు ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయ సందర్శనను కూడా చేర్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్, మినీ కోచ్ రూపంలో రెండు రకాల ప్యాకేజీలను, ప్రత్యేక రవాణా బడ్జెట్ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.