హైదరాబాద్ ఎంఎంటీఎస్ సేవలను మరింత చేరువ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే రెడీ అయింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు అల్వాల్ లయోలా కాలేజీ, ఆనంద్బాగ్, మౌలాలీ క్వార్టర్స్ వద్ద మూడు కొత్త స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి రైల్వే బోర్డుకు పంపింది. ఘట్కేసర్- సనత్నగర్ సెక్షన్లో ఈ స్టేషన్లు రావడం వల్ల శివారు ప్రాంతాల ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.