హైదరాబాద్ నగరంలో కబ్జారాయుళ్లకు, అక్రమ నిర్మాణదారులకు హైడ్రా పంజా విసురుతోంది. మంగళవారం ఐటీ కారిడార్ పరిధిలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో కోకాపేట, ఖానామెట్, భరత్నగర్ పరిసరాల్లోని మొత్తం 4 విలువైన స్థలాలను కబ్జా నుంచి విడిపించింది. దీని ద్వారా ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువు భూములను కాపాడి కంచెలు వేసింది. కోకాపేట కొత్తచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని విల్లాల అక్రమ నిర్మాణాలను, ఖానామెట్లో మాయం చేయాలని చూసిన ఈదులకుంట చెరువును, రోడ్డు విస్తరణకు పరిహారం పొంది మరీ కబ్జా చేసిన స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది.