హైడ్రా తెచ్చిన సంతోషం.. స్థానికులంతా అక్కడికే.. సంబరమే సంబరం..

1 year ago 33
ఫిర్జాదిగూడలో దశాబ్దాలుగా కబ్జాలో ఉన్న రెండు ఎకరాల శ్మశానవాటిక భూమిని నూతనంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ సంస్థ 24 గంటల్లోనే విముక్తి చేసింది. ఈ సందర్భంగా స్థానికులు పండగ చేసుకుంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పాలాభిషేకం చేశారు. ఏడేళ్లుగా పోరాడుతున్న తమ సమస్యను హైడ్రా వేగవంతమైన చర్యలతో పరిష్కరించిందని శ్మశానవాటిక పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో హైడ్రా ఒక ఆశాకిరణంగా నిలుస్తుందని ఈ ఘటన నిరూపించింది.
Read Entire Article