బీఆర్ఎస్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సరూర్నగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రోడ్లు దిగ్బంధం చేయకూడదని.. శాంతిభద్రతలకు భంగం కలిగించకూడదని.. పోలీసుల సూచనలు పాటించాలని ఆదేశించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ సభ లక్ష్యమని బీఆర్ఎస్ పేర్కొంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటంతో ఆసక్తికరంగా మారింది.