హైదరాబాదీల దాహార్తిని తీర్చే గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు

5 months ago 13
హైదరాబాద్ నగరవాసుల తాగు నీటి అవసరాలను తీర్చడంలో గండిపేట జలాశయానిది కీలక పాత్ర. 1920ల నుంచి నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చుతున్న ఈ ఉస్మాన్ సాగర్‌‌లో.. సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను కలపడానికి ప్రయత్నించడం కలకలం రేగింది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హిమాయత్ నగర్ దగ్గర్లోని.. ఎఫ్టీఎల్ పాయింట్ 428 నంబర్ వద్ద బుధవారం ఉదయం ఓ సెప్టిక్ ట్యాంకర్‌ను తీసుకొచ్చి వ్యర్థాలను పారబోస్తుండగా స్థానికులు గమనించారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచి నీటి చెరువులో మానవ వ్యర్థాలను కలిపే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article