తెలంగాణలో క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ రూపుమార్చుకుని ఇగ్నైట్ పేరుతో కొత్త గొలుసుకట్టు మోసాలకు తెరలేపింది. నిజామాబాద్కు చెందిన ఒక నిరుద్యోగ యువకుడు తన స్నేహితుడి నమ్మి రూ.5 లక్షలు పోగొట్టుకుని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగుచూసింది. రెండు రోజుల్లోనే ఏపీ, తెలంగాణ, పుణె ప్రాంతాల నుండి 30 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హాంకాంగ్ కేంద్రంగా షెల్ కంపెనీల ద్వారా సాగుతున్న ఈ దందాలో ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులే లక్ష్యంగా రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.