అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ క్రమంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై అమెరికా దాడి చేయడంతో అందులోని ముగ్గురు భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన ఆ ముగ్గురూ చనిపోయినట్టు కేంద్రం ప్రకటించింది. వీరిలో ఒకరు విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ ఉన్నట్టు తాజాగా వెల్లడయ్యింది. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు దీనిని ధ్రువీకరించారు. ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏపీ, ఒకరు యూపీ, మరొకరు హిమాచల్ వాసి.