ఓయూ పరిధిలోని పీహెచ్డీ విద్యార్థులు.. తమ పరిశోధనలకు సంబంధించిన పత్రాలను ఏఐ ద్వారా రూపొందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ ఏఐ సాయంతో తయారు చేసిన రికార్డులను గుర్తించేందుకు కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏఐ కంటెంట్ను గుర్తించనున్నారు. ఇలా ఏఐ ద్వారా పరిశోధన పూర్తి చేసి రికార్డులు సమర్పించిన విద్యార్థులకు.. ఎక్కడా పీహెచ్డీ సీటు రాకుండా చేస్తామని అధికారులు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు.