Peddapalli One And Only 10th Class Student Pass: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న ఏకైక పదో తరగతి విద్యార్థి పాసయ్యాడు. గుంటి మధు 429 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. మధు స్కూల్కు వెళ్లకపోయినా సరే ఉపాధ్యాయులు పట్టుదలతో అతడి ఇంటికెళ్లి పాఠాలు చెప్పారు. మధు ఉత్తర్ణుడు కావడంతో స్కూల్ జీరో పర్సెంట్ ఫలితాల నుంచి బయటపడింది. స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆనందంలో ఉన్నారు.