శాంతిభద్రతలను కాపాడి బాధితులకు న్యాయం చేయాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి అరాచకానికి ఒడిగట్టాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి ఆమె సంసారాన్ని కూల్చి శారీరకంగా లొంగదీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. దీంతో హనుమకొండ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద సదర్ ఎస్సైపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.