స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. హాజరు నిబంధనల్లో మార్పులు

4 months ago 27
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు గమనిక. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు నిబంధనలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా ఉదయం 10 గంటల 30 నిమిషాలలోపు హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఉదయం పది గంటల 40 నిమిషాలు దాటిన తర్వాత హాజరు నమోదు చేస్తే.. హాఫ్ డే లీవ్‌గా పరిగణిస్తారు. అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు మధ్య హాజరు నమోదైతే.. పూర్తి రోజు సెలవుగా పరిగణిస్తారు. ఈ మేరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌.. ఫేసియల్ రికగ్నిషన్ యాప్‌లో నిబంధనలు అప్ డేట్ చేశారు.
Read Entire Article