స్మార్ట్ మీటర్‌తో అధికంగా కరెంట్ బిల్లులు..! విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

1 year ago 32
స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అడుగులు పడగా, ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
Read Entire Article