స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేసేందుకు మల్కాజిగిరి పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లపై ఏకంగా 500 మంది పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడి చేశారు. దీంతో స్పా సెంటర్ల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. కస్టమర్ల డేటా రిజిస్టర్ను మెయింటైన్ చేయడం లేదని వెల్లడైంది. ఈ సందర్భంగా స్పా సెంటర్లు నిర్వహిస్తున్న ఇళ్ల ఓనర్లను కూడా పోలీసులు విచారణ జరిపారు.